కాకతీయుల నాటి అద్భుత కట్టడం.. ములుగు జిల్లా రామప్ప ఆలయం ఆవరణలో మంగళవారం రాత్రి ప్రపంచ వారసత్వ దినోత్సవాలు వైభవంగా జరిగాయి. వివిధ వ్యాపార సంస్థలు, ములుగు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మంత్రులు శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు వేడుకలను ప్రారంభించారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం దేశానికే గర్వకారణమన్నారు. రామప్పను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్, వాయిద్యకారుడు శివమణి, గాయకుడు కార్తీక్ల ప్రదర్శనలు అలరించాయి. రాజ్కుమార్ బృందం పేరిణి నృత్యం, దాదాపు 200 మంది కళాకారులతో శ్రావ్య మానస కళా ప్రదర్శన నిర్వహించారు. ‘బలగం’ చిత్ర బృందాన్ని ఈ సందర్భంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు. వివిధ రకాల వంటకాలను పరిచయం చేశారు.
![](https://i.ytimg.com/vi/04RNWM8o5KE/mqdefault.jpg)