పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటమే ఘన నివాళి!
23,మార్చి,వేంసూరు వార్త:నేటి పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు చేయడమే అమరవీరులకు ఇచ్చే ఘన నివాళి అని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ అన్నారు.బుధవారం మండల పరిధిలోని మర్లపాడు గ్రామ సీఐటీయూ కార్యాలయ ఆవరణలో అమర వీరులు భగత్ సింగ్,రాజ్ గురు,సుఖదేవ్ ల 92 వ వర్ధంతి సభ జరిగింది.సభలో పాల్గొన్న మల్లూరు మాట్లాడుతూ దేశం కోసం పిన్న వయసులోనే ఉరి కం భాన్ని ముద్దాడిన విప్లవ కిషోరాలు అని నిజమైన దేశ భక్తులు వారేనని అన్నారు.నేడు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కారు కార్పొరేట్లకు అమ్ముకుంటూ దేశ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించ పరుస్తుందని అన్నారు.మార్చి 28,29 తేదీలలో జరిగే దేశ వ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ లను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో: నేతలు డంకర శ్రీను,సాధు శరత్ బాబు,గుంట్రు వెంకటేశ్వరరావు,మొహిద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
![](https://i.ytimg.com/vi/QxwH4yHI7Us/maxresdefault.jpg)