ఎన్ డి ఏ ప్రభుత్వ ఏర్పడిన తర్వాత
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పున ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని,
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు,
మంత్రి అచ్చం నాయుడు కు, మంత్రి నారా లోకేష్ కు,
స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు విదేశీ విద్య ప్రతాతలకు ధన్యవాదాలు స్కూటీ యాత్రలో భాగంగా హిందూపురం నుంచి అమరావతికి
హిందూపురం పట్టణానికి చెందిన మగ్బుల్ జాన్ గురువారం ఉదయం
స్కూటీ యాత్రను ప్రారంభించారు,
ఈ సందర్భంగా ఆమె
మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సకాలంలో స్కాలర్షిప్లు అందక పిల్లలు విదేశీ దూరమయ్యారని ఇదే విషయంపై 2020లో విదేశీ స్కాలర్ షిప్ ల కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
దృష్టికి తీసుకెళ్లేందుకు హిందూపురం నుండి విజయవాడకు స్కూటీ యాత్రతో వెళ్లి కలవడానికి ప్రయత్నం చేసిన గేటు నుంచి బయటకు పంపించారని,కనీసం విషయం కూడా పట్టించు కోలేదని తెలిపారు,గత ప్రభుత్వ హయాంలో ఎందుకు పనికి రాని జగనన్న విదేశీ విద్య పథకం ఎందుకూ విద్యార్థులకు పనికి రాలేదన్నారు,
దీంతో తాను అప్పట్లో నిరాహార దీక్షలు చేశానన్నారు,దీంతో అప్పట్లో చంద్ర బాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్,అచ్చం నాయుడు,నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి జరిగిన అన్యాయం పై తీసుకెళ్లా నన్నారు,దీంతో టీడీపీ ప్రభుత్వం అధికారం లోకి రాగానే తప్పని సరిగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు,దీంతో ఎన్ డి ఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు అంబేద్కర్ విదేశీ విద్య స్కాలర్ షిప్ పథకాన్ని పున ప్రారంభించడం జరిగిందన్నారు,దీంతో విదేశీ విద్యా ప్రదాతకు ధన్యవాద స్కూటీ యాత్రను ప్రారంభించడం జరిగిందని తెలిపారు, ఈ సందర్భంగా గోరంట్ల పట్టణంలోని చంద్ర శేఖర్ థియేటర్ నందు ఆమెకు టీడీపీ మైనార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు, ఈ కార్య క్రమంలో పార్లమెంటు కార్య దర్శి అజ్ముతుల్ల,షారూక్ షర్ ఫుద్దీన్,సాదిక్,మల్లాపల్లి ఫిరోజ్ అహ్మద్, షామీర్ బాషా,సుబ్బరాయుడు, అన్నపూర్ణ హోటల్ ఆదినారాయణ,మహబూబ్ ఖాన్,తదితరులు పాల్గొన్నారు.
![](https://i.ytimg.com/vi/XTqTUNaCstY/maxresdefault.jpg)