నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా బంగాల్ లో భాజపా, తృణముల్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. కోల్ కతా సమీపంలోని భాట్ పాడాలో నిర్వహించిన నేతాజీ జయంతి కార్యక్రమానికి భాజపా MP అర్జున్ సింగ్ హాజరయ్యారు. ఈ సమయంలో కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారని పోలీసులు తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య హింసకు దారితీసినట్లు వివరించారు. ఈ ఘటనలో ఓ పోలీసు వాహనం సహా రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలిలో మోహరించారు. అంతకుముందు.. శనివారం రాత్రి TMC పార్టీ కార్యాలయంపై దుండగులు నాటు బాంబులు విసిరినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో భాజపా, TMC వర్గాల మధ్య ఘర్షణ మొదలైనట్లు చెప్పారు.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: [ Ссылка ]
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: [ Ссылка ]
☛ Subscribe for Latest News - [ Ссылка ]
☛ Subscribe to our YouTube Channel : [ Ссылка ]
☛ Like us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Etv Win Website : [ Ссылка ]
-------------------------------------------------------------------------------------------------------
Ещё видео!