సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.com కు email చెయ్యండి.
అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి.
కవులందరిలోకీ కాళిదాసు గొప్పవాడైతే.. కాళిదాసు రచనల్లోకెల్లా రఘువంశం గొప్పది. ఈ రఘువంశం 19 సర్గలున్న కావ్యం. ఇందులో మొత్తం 29మంది రఘవంశానికి చెందిన రాజుల చరిత్ర ఉంది. అయితే 22 చరిత్రలు విపులంగాను, ఏడుగురు రాజుల కథలు సక్షిప్తంగానూ చెప్పాడు కాళిదాసు.
"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ"
అన్న ప్రార్థనా శ్లోకంతో రఘవంశ కావ్యాన్ని ప్రారంభించాడు కాళిదాసు. శబ్దము, అర్థము ఎలా అయితే ఒకదాన్ని విడిచిపెట్టి ఇంకొకటి ఉండలేవో అలా విడదీయరాని సంబంధం కలిగినటువంటివారును, ఈ జగత్తుకు తల్లిదండ్రులును అయినటువంటి పార్వతీపరమేశ్వరులను శబ్దార్థాల జ్ఞానం కొరకు ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను అన్నది ఈ శ్లోకానికి అర్థం. ఇక కథలోకి వెళితే..
- Rajan PTSK
#raghuvamsam #Kalidasu #LordRama
Ещё видео!