వెన్నముకపై కణితో బాధపడుతున్న చిన్నారికి శస్త్రచికిత్స చేసి తొలగించామని ప్రముఖ వైద్యుడు డాక్టర్ NCK రెడ్డి తెలిపారు. కడపజిల్లాకు చెందిన కారు డ్రైవర్ ఖాజా మోహియుద్దీన్, షబానాల రెండేళ్ల కుమారుడు తాజుద్దీన్ వెన్నముకపై కణితితో జన్మించాడు. రోజురోజుకి కణితి పెరగటంతోపాటు... చిన్నారి నడవలేని స్థితికి చేరాడు. శస్త్రచికిత్స కోసం తమిళనాడులోని వివిధ ఆస్పత్రుల్లో చూపించినా ప్రయోజనం లేకపోవటంతో.... స్థానికులు కొందరు ట్విట్టర్ ద్వారా డాక్టర్ NCK రెడ్డికి పరిస్థితి వివరించారు. స్పందించిన ఆయన....ఉచితంగా తాజుద్దీన్ కి శస్త్రచికిత్స నిర్వహించారు.
#NewsOfTheDay
#EtvTelangana
Ещё видео!